బడ్జెట్‌ సమావేశాల్లో GSTఆమోదం..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (రెండో విడత) ఈ నెల 25 నుంచి ప్రారంభమవనున్నాయి. మే 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో జీఎస్‌టీ సహా పలు కీలక బిల్లులు ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కీలకమైన జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉందని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయన్న నమ్మకం తమకుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.