ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌..

 బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సిపిఐ(యం), కాంగ్రెస్‌ ఆ పనిలోనే వున్నాయి. ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌ అస్త్రాలతో ప్రచారం చేస్తున్నాయి. అయితే తృణమూల్‌ అవినీతి పాపం ప్రధానమైనదే అయినప్పటికీ ... తమ ఎన్నికల ప్రచార అంబుల పొదిలో మరిన్ని పదునైన అస్త్రాలున్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, పారిశ్రామికీకరణ లేమి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు వంటి పలు అంశాలకు కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తామంటున్నారు.