
ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.