![](https://cpimap.org/sites/default/files/mar.jpg)
దేశవ్యాప్తంగా దాడులు, రచయితలు, మేధావుల నిరసనలతో ఉడుకెక్కిన వాతావర ణంపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి రోడ్డెక్కింది. ‘అసహన స్థితి’ని తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరుతూ..కాంగ్రెస్ అధినాయకత్వమంతా దేశ రాజధానిలో కదం తొక్కింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోదీ పోడకలను నిరసిస్తూ .... ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పాదటయాత్రగా ముందుకు కదిలింది. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్కు దారితీసే మార్గంలో, ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల జెండాలతో కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శన సాగించాయి.