పార్లమెంట్లో DDCA గొడవ..

డిడిసిఏ అక్రమాలపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే.. డిడిసిఏ కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు హంగామా చేశాయి. డీడీసీఏపై చర్చకు వీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది.