పాక్ వెళ్లనున్న భారత ప్రధాని..

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే పాకిస్తాన్‌కు వెళ్లనున్నాడని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. హార్ట్ ఆఫ్‌ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఆమె మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు. 2016లో జరగబోయే సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోపరేషన్‌ (సార్క్) సమ్మిట్‌లో భాగంగా మోడీ ఇక్కడి రానున్నట్లు పేర్కొన్నారు.