దాద్రీ ఘటనలో కొత్త కోణం ..

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రీ సంఘటనలో మృతుడు అఖ్లాఖ్‌(52) నివాసంలో లభించింది ఆవు మాంసం కాదని, అది మేక మాంసమని అధికారులు నిర్ధారించారు. అఖ్లాఖ్‌ ఆవు మాంసం తిన్నాడనే ఆగ్రహంతో ఒక గుంపు సెప్టెంబర్‌ 28న అతడిని హతమార్చిన విషయం విదితమే.ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పశువైద్యశాఖాధికారులు దానిని పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు.అక్కడ అది మాంసం కాదని, మేక మాంసమని నిర్ధారించారు. దీనిపై మృతుడి భారత వాయుసేన ఉద్యోగి సర్తాజ్‌ మాట్లాడుతూ రాజకీయ కారణాలతోనే తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు.