దళిత సంక్షేమంపై మోడీ మౌనమేల..?

దళితుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్‌ నేత పి.ఎల్‌.పునియా మోడీ సర్కార్‌ను విమర్శించారు. ప్రైవేట్‌ రంగంలో, న్యాయ వ్యవస్థలో కూడా కోటా వుండాలన్న డిమాండ్‌ చాలా పాతదని, కానీ దాని గురించే కేంద్రం ప్రస్తావించడం లేదన్నారు. యుపి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందన్నారు.