జైట్లీ రాజీనామాపై ఏచూరి..

డిడిసిఎ కుంభకోణంపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని రాజీ నామా చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలి చ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. హవాలా కేసులో అద్వానీ చేసినట్లుగా ఇక్కడ జైట్లీ కూడా చేయాలని మోడీ భావిస్తు న్నారని ఏచూరి పేర్కొన్నారు. అద్వానీకి, అరుణ్‌ జైట్లీకి పోలిక తీసుకురావడం ద్వారా జైట్లీ రాజీనామా చేయాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకుని తిరిగి రావాలని ప్రధాని మోడీ ఆయనకు ఒక సంకేతం పంపారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.