
డీడీసీఏలో చోటు చేసుకున్న అవినీతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నియమించిన దర్యాప్తు కమిషన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు బీజేపీ పేర్కొన్నడాన్ని ఆప్ తప్పుపట్టింది. డీడీసీఏ అవినీతిపై ఆప్ నియమించిన సొంత విచారణ కమిటీనే తన నివేదికలో జైట్లీ పేరును ప్రస్తావించకపోవడంతో కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ దానిని తోసిపుచ్చారు.'జైట్లీ డీడీసీఏ అధిపతిగా ఉన్న కాలంలో అవినీతి జరిగింది. ఆయనకు క్లీన్ చిట్ ఇస్తే మరి అవినీతి ఎవరు చేసినట్టు? దయ్యాలు చేశాయా?' అంటూ ప్రశ్నించారు.