జేఎన్‌యూపై రాష్ట్రపతి జోక్యానికి వినతి

జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ దమన వైఖరిపై ప్రతిపక్ష ఎంపీల బృందం శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. కాగా విద్యార్థుల దీక్షలు నేడు 10వ రోజుకు చేరుకున్నాయి. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కన్నయ్యకుమార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.