గ్రామాలు ఖాళీచేయండి:బాబు

పోలవరం నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకుండా మొండికేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. డిసెంబర్‌ నెలాఖరుకు చేగొండపల్లి, జనవరి నెలాఖరుకు పైడిపాక, రామయ్యపేట గ్రామాలను ఖాళీ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిర్వాసితులు ఊళ్లు వదిలిపెట్టకపోతే వారికి అందాల్సిన పరిహారం దక్కకుండా పోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కూడా అందవని స్పష్టంచేశారు.