గొంతువిప్పినకార్పొరేట్ దిగ్గజం

దేశంలో నేడు మైనార్టీ సముదాయాలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఒక మీడియా ఇంటర్వూలో మాట్లాడుతూ, దేశం ఆర్థిక వృద్ధి సాధించాలంటే భయ వాతావరణాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా ఒక కార్పొరేట్‌ దిగ్గజం గొంతు విప్పడం ఇదే మొదటిసారి. అసహనం తగదని మూడీస్‌ అనాలిటిక్స్‌ మోడీకి సూచన చేసిన తర్వాత నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.