గిరిజనులకు ఉచిత వైద్యపరీక్షలు..

 చింతూరు మండలంలో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యశిబిరంలో ఆదివారం 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురిని మలేరియా బాధితులుగా గుర్తించారు. ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 100 మంది వైద్యశిబిరానికి వచ్చారు. వారిలో ఐదుగురు మలేరియా బాధితులు ఉన్నారని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు తెలిపారు.రోజురోజుకూ వైద్యశిబిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, వారందరికీ తగిన వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.