కాంగ్రెస్ వాళ్ళనైనా చేర్చుకుందాం:బాబు

సచివాలయంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో ఏ ముఖ్య నాయకుడు ఆసక్తి చూపి మన పార్టీలోకి వచ్చినా చేర్చుకుందాం. వైకాపా అనే కాదు కాంగ్రెస్‌లోనూ ముఖ్య నాయకులున్నారు. వారినీ చేర్చుకుందాం. శాసనసభ, మండలి స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోంది. అన్ని రకాల పదవులూ కలిపి రాష్ట్ర స్థాయిలో 400 నుంచి 500 ఉంటాయి. ఎంతమంది వచ్చినా ఎవరి అవకాశాలకీ గండిపడదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..