కాంగ్రెస్‌తో పొత్తుకు BJP రెడీ

అగర్తలా : రాబోయే పౌర సంస్థల ఎన్నికల్లో పాలక వామపక్ష సంఘటనను ఓడించేందుకు ఎన్నికల పొత్తు పెట్టుకుందామంటూ త్రిపురలో బిజెపి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను అభ్యర్థించింది. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామమే. వామపక్షాల అభ్యర్థులను ఓడించాలంటే ప్రతిపక్ష పార్టీల ఓట్లన్నింటినీ కలిపితేనే సాధ్యమవుతుందని బిజెపి భావిస్తోంది.