కమలం ఎప్పటికి వికసించేనో..?

తాజా బిహార్‌ ఎన్నికల్లో వాడిపోయిన కమలం.. ఇప్పట్లో వికసించే సూచనలు కనిపించడం లేదు. రానున్న 2016లో దేశంలోని నాలుగు ప్రధాన రాష్ర్టాలు సహా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆయా రాష్ర్టాల్లోనూ బీజేపీ గెలిచే అవకాశం ఎంత మాత్రమూ లేదు! ఎందుకంటే ఆయా రాష్ర్టాల్లో స్థానిక పార్టీల హవా ఉధృతంగా కొనసాగుతుండడం, జాతీయ పార్టీ అయిన బీజేపీకి అంత ప్రాబల్యం లేకపోవడమే కారణం. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం సహా పుద్దుచ్చేరి అసెంబ్లీలకు 2016లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ర్టాల్లో బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఆశించిన మేరకు లేదు.