District News

కేంధ్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌ ఏడాది పాల‌న‌లో అన్ని ర‌కాల అవినీతి పెర‌గిపోయింద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు ప్ర‌కాష్ క‌రత్ విమ‌ర్శించారు. కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై దేశ‌వ్యాప్త ప్ర‌చారోద్య‌మాన్ని గుంటూరులో ఆయ‌న ప్రారంభించారు. ఆగ‌ష్టు 1 నుంచి 15 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారోద్య‌మం ద్వారా ప్ర‌భుత్వవిధానాల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని తెలిపారు. ఏడాది పాల‌న‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, మ‌తోన్మాదుల దాడులు వంటి విష‌యాల్లో త‌ప్ప ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఏవిధంగానూ నెర‌వేర‌డం లేద‌ని క‌ర‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేంధ్ర‌మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు అన్న‌దాత‌ల‌ను కింప‌రిచే...

 

- కౌలు పరిహారం, పెన్షన్ల కోసం రాస్తారోకో, అరెస్టు

- పలువురికి స్వల్పగాయాలు, దుర్భాషలాడిన సిఐ
- మీడియాపై ఆంక్షలు, పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
                        రాజధానిలో అసైన్డ్‌, సీలింగు భూములకు పరిహారం, నిరుపేదలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వాలని తుళ్లూరులో మంగళవారం రాస్తారోకోకు దిగిన పేదలపై పోలీసులు ప్రతాపం చూపారు. వారిని నడిరోడ్డుపై ఈడ్చి పారేశారు. నాయకులను మాట్లాడనివ్వకుండా మైకు లాగేసుకున్నారు. సిఐ హనుమంతరావు నాయకులను, పేదలను పరుష పదజాలంతో దూషించారు. ఏరు..ఏంట్రా మీకు నోరు పెరిగింది...

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

సి.పి.యం ప్రచార కార్యాక్రమంలో బాగంగా చుట్టుకుంట సెంటర్ లో విద్యార్ధులతో పాశం రామారావు మాట్లడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఎంతో అభివృద్ది చెందినదని చెప్పుకుంటున్న జిల్లాలో సుమారు 16 మండలలో 50 శాతం లోపు అక్షరాస్యతతోనే ఉన్నాయని, వాటిల్లో 15 మండలాలు పల్నాడు ప్రాతంలోనే ఉండటం శోచనీయమన్నారు ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినా ఉపాధి మాత్రం చాలా నామమాత్రంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహలు మౌలిక వసతులు కల్పించకపొవటంతో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర కార్యదర్శి ఎన్. భావన్నారాయణ మాట్లాడుతూ నగరంలో మున్సిపల్ పాఠసాలల్లో అనేక సమస్యలున్నాయని, అదనపు తరగతి గదులు నిర్మించాలని,...

 

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

ప్రజల జీవన ప్రమణాలు మొరుగుపదటం, వారి కొనుగోలుశక్తి పెరగటం ద్వార మాత్రమే నిజమైన అభివృధి సాధ్యమవుతుంది అని లక్ష్మణ్ రావు అన్నారు. ఆగస్టు 1నుండి 14 వరుకు జరిగె రాజకీయ ప్రచారం సందర్భంగా స్థానిక సి.పి.యం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేసంలో మాట్లాడుతూ, 73,74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు సంబంధించి ముఖ్యమేనవన్నారు. వాటి ప్రకారం రాష్ట్ర పైనాన్స్ ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలని, మున్సిపాల్టీలకు 18 హక్కులు కల్పించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చెయటం లేదు, జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం పథకానికి మరో రూపమే స్మార్ట్ సిటీలని, వాటి వల్ల ప్రజలపై పన్నుల భారం పెరుగుతాయి తప్ప సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరంలో రూ. 430 కోట్లతో జరుగుతున్న సమగ్ర...

నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభలో...

రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య, రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు తక్షణమే పింఛను...

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. 'ప్రజాస్వామ్యం- కార్పొరేట్ రాజకీయాలుస అనే అంశం పై గుంటూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పధ్రాన వ‌క్త‌గా కారత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై వాగ్ధానాలు గుప్పించిన బిజెపి ఇప్పుడెందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి ఇంద్రజిత్ ప్రకటించడం సరికాదన్నారు.

Pages