కేంధ్రంలో బీజేపీ ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని రకాల అవినీతి పెరగిపోయిందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ విమర్శించారు. కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని గుంటూరులో ఆయన ప్రారంభించారు. ఆగష్టు 1 నుంచి 15 వరకూ దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం ద్వారా ప్రభుత్వవిధానాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. ఏడాది పాలనలో రైతు ఆత్మహత్యలు, ధరల పెరుగుదల, మతోన్మాదుల దాడులు వంటి విషయాల్లో తప్ప ప్రజా ప్రయోజనాలు ఏవిధంగానూ నెరవేరడం లేదని కరత్ ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యలపై కేంధ్రమంత్రులు చేసిన వ్యాఖ్యలు అన్నదాతలను కింపరిచే...