మేడే నాడు పార్టీ ఆఫీసుల వద్ద, ఇతర చోట్ల జెండాలు ఆవిష్కరించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 ఏప్రిల్‌, 2024.

 

మేడే నాడు పార్టీ ఆఫీసుల వద్ద, ఇతర చోట్ల జెండాలు ఆవిష్కరించడానికి, కార్మికులు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతినివ్వాలని కోరుతూ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు జె.జయరాం వినతిపత్రం ఇచ్చారు. చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌  అనుమతినిస్తూ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు ఉత్తరం పంపారు. కాపీని జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు, సూపరిండిరట్‌ ఆఫ్‌ పోలీస్‌లకు కాపీని పంపారు. ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా జరపవచ్చని, ప్రదర్శనలకు, బహిరంగసభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. సిఇఓకు పార్టీ రాసిన వినతిపత్రాన్ని, సిఇవో పంపిన ఉత్తరాన్ని జతపరుస్తున్నాము.

 

 

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి