బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు ఉమ్మడి పోరాటానికి సిద్ధం...

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు

ఉమ్మడి పోరాటానికి సిద్ధం

కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ

 

బిజెపి దాని మద్దతుదారులను ఓడిరచాలని కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ ఉమ్మడి నిర్ణయానికి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపైనా త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయా పార్టీల నాయకులు తెలిపారు. ఎపిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల ఆహ్వానం మేరకు సిపిఎం, సిపిఐ నాయకులు శుక్రవారం ఆంధ్రరత్నభవన్లో ఆమెను కలిశారు. తొలుత సిపిఎం నాయకులతో చర్చించిన షర్మిల, అనంతరం సిపిఐ నాయకులతో వేర్వేరుగా చర్చించారు. బిజెపి, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలపై పోరాటం తదితర అంశాలపై మాట్లాడారు. ఆనంతపురంలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ సభకు సంబంధించిన వివరాలనూ షర్మిల నాయకులకు తెలిపారు. సభలో పాల్గనాలని కోరారు. వేర్వేరుగా జరిగిన ఈ చర్చల్లో పాల్గన్న వారిలో కాంగ్రెస్‌ తరుపున పిసిసి అధ్యక్షులు షర్మిల, సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు, జె.డి.శీలం, సిపిఎం తరుపున రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ఉన్నారు. సిపిఐ తరుపున చర్చించిన వారిలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జెల్లి విల్సన్‌ ఉన్నారు. అనంతరం మూడు పార్టీల నాయకులు విలేకరులతో మాట్లాడారు.

మూడు పార్టీలు కలిసి పోరాడుతాయి.

 

ఎపిసిసి అధ్యక్షులు షర్మిల

ఎపిసిసి అధ్యక్షులు షర్మిల మాట్లాడుతూ రాష్ట్రం పదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేదని, దీనికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలే కారణమని తెలిపారు. చంద్రబాబుగానీ, జగన్‌గానీ హోదాపై మాట్లాడటం లేదని విమర్శించారు. బిజెపి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చలేవని, పాలకులూ అడగడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే బిజెపి మెడలు వంచుతానన్న జగన్‌ ఈ ఐదేళ్లలో ఒక్కపోరాటం కూడా బిజెపికి వ్యతిరేకంగా చేయలేదని తెలిపారు. వైసిపి, టిడిపి రెండూ బిజెపికి బానిసలేనని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తుందని, దీనికోసం రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి పోరాడుతామని తెలిపారు. దీనిపై చర్చించామని, కలిసికట్టుగా వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అనంతపురం సభకు సిపిఎం, సిపిఐ నాయకులను ఆహ్వానించామని, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆళ్ల రామకృష్ణ తనకు కావాల్సిన వ్యక్తని, అయపై ఉన్న తీవ్ర ఒత్తిడివల్లే వెనక్కు వెళ్లాడని, ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచడమే లక్ష్యం

ఎన్నికల్లో సర్దుబాటు : వి.శ్రీనివాసరావు 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచడమే లక్ష్యంగా ఉమ్మడిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. చర్చల్లో రెండు విషయాలపై ఏకాభిప్రాయం వచ్చిందని ఒకటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి, దానికి కొమ్ముకాస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వైసిపి, టిడిపి జనసేన కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, యువత భవిష్యత్‌ను నాశనం చేశారని, డిఎస్‌సి ఇవ్వకుండా లక్షమందిని వీధులపాలు చేశారని విమర్శించారు. టిడిపి నాయకులు రాష్ట్రం కోసం బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నామని చెబుతున్నారని, ద్రోహం చేసిన బిజెపిని ప్రజలు చెత్తబుట్టలో పడేశారని, అటుంటి బిజెపిని కలవడం సిగ్గుచేటని, దీనిపై చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రజలను మోసం, దగా చేస్తున్నారని, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏ ముఖ్యమంత్రి తిరగనన్ని సార్లు జగన్‌ ఢల్లీి చుట్టూ తిరుగుతున్నారని, రాజధానికి, పోలవరానికి నిధులు తేలేకపోయారని, విశాఖ అమ్మకాన్ని ఆపలేకపోయారని అన్నారు. రెండేళ్ల క్రితం కడపస్టీలుకు జిందాల్‌తో శంకుస్థాపన చేశారని, ఇప్పటి వరకూ పునాది రాయి కూడా వేయలేదని అన్నారు. స్వార్థ రాజకీయాలు, అధికారం కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు సిఎంకు పట్టలేదని అన్నారు. ఈ మూడుశక్తులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బిజెపి దళితులు, మైనార్టీలు, మహిళలకు తీరని అన్యాయం చేస్తోందని, సామాజిక న్యాయానికి ఘోరీ కడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇండియా బ్లాకులో అనేక చిన్నచిన్న పార్టీలు ఉన్నాయని అన్నిటితోనూ సహకరించుకుని ఎన్నికల్లో పోటీపడకుండా దుష్టకూటములను ఓడిరచాలని అనుకున్నామని, దీనికి వీలుగా ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాలనీ అనుకున్నట్లు తెలిపారు. ఆ రకంగా ప్రజల ముందుకు వెళతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐ అలాగే కలిసివచ్చే పార్టీలను కులుపుకుని ముందుకు వెళతాయని తెలిపారు. రాష్ట్రంలో ఇది మంచి శుభసూచకమని పేర్కొన్నారు. మోడీని, బిజెపిని ప్రజల్లో ఎండగట్టి ముందుకు వెళ్లేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 

 

బాబు, పవన్‌, జగన్‌ మోడీకి దాసోహం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బిజెపికి భయపడుతున్నాయని తెలిపారు. జగన్‌, బాబు, పవన్‌ మోడీకి దాసోహమంటున్నారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇతర ప్రజాతంత్ర పార్టీలను కలుపుకుంటామని, బిజెపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని పేర్కొన్నారు. దీనిపై ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. అనంతపురం సభకు రావాలని షర్మిల ఆహ్వానించారని పేర్కొన్నారు.