పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారి అరెస్టు కు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 22 ఫిబ్రవరి, 2024.

 

 

రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరుతూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారిని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. నిరసన తెలియజేయడానికి ఛలో విజయవాడకు కార్యకర్తలు రాకుండా ముందస్తు అరెస్టులు చేయడం, నిరంకుశ వైసిపి ప్రభుత్వం యొక్క నైజం వెల్లడవుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఊరట కల్గించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి