తుఫాన్‌ ప్రాంతాల్లో సిపియం బృందాల పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 05 డిసెంబర్‌, 2023.

 

 

తుఫాన్‌ ప్రాంతాల్లో సిపియం బృందాల పర్యటన

 

‘‘మిచౌంగ్‌’’ తుఫాన్‌ ధాటికి రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సహాయక శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అరకొర సౌకర్యాలే ఉన్నాయి. వరిపంట నీటిలో మునిగింది. ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా తేమ పేరుతో కొనుగోళ్ళు జరగక కళ్ళాలోనే ధాన్యం ఉండిపోయింది. నిలువున ఉన్న వరిపంట గాలికి పూర్తిగా నేలకొరిగింది. మరో రోజు ఇలానే వర్షం కొనసాగి, గాలి వస్తే అరటి, మిర్చి, ప్రత్తి పంట పూర్తిగా దెబ్బతిని చేతికి రాకుండా పోతుంది. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన కౌలురైతులు మరింత నష్టపోతారు. ఈ నేపథ్యంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 బృందాలు తుఫాను ప్రభావిత వరద ప్రాంతాలను పర్యటించనున్నాయి.

 

బాపట్ల జిల్లా

వి.శ్రీనివాసరావు ` సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి 

డి.రమాదేవి ` రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

కె.ధనలక్ష్మీ ` రాష్ట్ర కమిటి సభ్యులు

 

కృష్ణా జిల్లా

వై.వెంకటేశ్వరరావు ` రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 

వి.కృష్ణయ్య, ` రాష్ట్ర కమిటీ సభ్యులు

వై.నరసింహరావు ` కృష్ణా జిల్లా కార్యదర్శి

ఎం. హరిబాబు ` కౌలురైతు రంగ నాయకులు

 

నెల్లూరు జిల్లా

సిహెచ్‌. బాబూరావు ` సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యలు

మూలం రమేష్‌ ` నెల్లూరు జిల్లా కార్యదర్శి

కె.ఉమామహేశ్వరరావు ` రాష్ట్ర కమిటి సభ్యులు 

 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి