May

అమరావతికి ఆ ప్రతిపాదనే లేదు:మనోజ్‌ సిన్హా

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..

ముగిసిన బెంగాల్‌లో ఎన్నికలు..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్ని కల ఆరవ, తుదివిడత పోలింగ్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ముగిసింది. తూర్పు మిడ్నపూర్‌, కూచ్‌బెహర్‌ జిల్లాల్లోని 25 నియోజకవర్గాల్లో 6774 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ బూత్‌లకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుదివిడతలో రికార్డు స్థాయిలో 84.24 శాతం పోలింగ్‌ నమోదైంది. 

9వ రోజుకు చేరిన కన్నయ్య నిరాహార దీక్ష

 నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం నుంచీ ఆయనకు వాంతులు మొదలయ్యాయి. బీపీ 80/56కు పడిపోయింది. దాదాపు అపస్మారక స్థితిలో సహచర విద్యార్థులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన శరీరం లోపలి అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు భావిస్తున్నారు. ఆహారం తీసుకోకపోతే అంతర్గత రక్తస్రావానికి దారితీయొచ్చని డాక్టర్లు హెచ్చరించారు. కాగా, తనకేం జరిగినా ఫర్వాలేదు కానీ దీక్ష విరమించేది లేదని కన్నయ్య స్పష్టం చేసినట్టుగా సమాచారం. 

PDF సరైన ప్రత్యామ్నాయం:బృందా

తమిళనాట డి.ఎం.కె, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె లకు సరైన ప్రత్యామ్నాయం ప్రజా సంక్షేమ కూటమేనని (పిడబ్ల్యుఎఫ్‌) సి.పి.యం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా బుధవారంనాడు మధురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బృంద సభకు తమ అభ్యర్థులను పరిచయం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధమై న అవినీతి ఆరోపణలు లేని, ఉమ్మడి భావజాలం కలిగిన వారితో తొలిసారిగా ఏర్పడిన కూటమి పిడబ్ల్యుఎఫ్‌ అని, నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక రంగాలలో విఫలమైన తమిళనాడును పునర్నిర్మించాలన్న లక్ష్యంతో ఏర్పడిందని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు:జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదర దంటూ కేంద్రం వరుసగా ప్రకటనలు మీద ప్రకట నలు గుప్పిస్తోంది. కేంద్ర హోం సహాయ మంత్రి హె చ్‌పి చౌదరి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్‌ సిన్హా ఇచ్చిన ప్రకటనలతో షాక్‌ తిన్న ఆంధ్రప్రదేశ్‌కు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరో షాక్‌ ఇచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా వుండదని నేరుగా చెప్పకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇప్పటికే ఇచ్చేశామన్నారు. ఇంకా ఇవ్వాల్సినవేమైనా వుంటే అవి కూడా పైసాతో సహా ఇచ్చేస్తామని అన్నారు.

బ్రాండిక్స్ కార్మికులకు బరోసా..

గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..

బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యలపై రాష్ట్రస్థాయిలో పోరాటం

              కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతుగా బుధవారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో వారు పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి ఏజెంటుగా పని చేస్తున్నారని, జీతాలు పెంచమంటే నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారని తెలిపారు.

Home » District » Visakapatnam 'ఆంత్రాక్స్‌' మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

 - వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక వైద్య శిబిరాలు
 - బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ 
 - సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌
 - పనసపుట్టు గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం
              హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యాన్ని పట్టి పీడిస్తున్న ఆంత్రాక్స్‌ మహ్మామారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నిపుణులైన డాక్టర్లతో 

బ్రాండిక్స్‌ నిర్బంధంపై చేతులకు సంకెళ్లతో వినూత్న నిరసన

  (visakha rural)          అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కార్మికులపై యాజమాన్యం, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం అడ్డురోడ్డు కూడలి వద్ద చేతులకు సంకెళ్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం బ్రాండిక్స్‌ యాజమాన్యానికి తొత్తుగా మారారని విమర్శించారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమన్నారు.

Pages

Subscribe to RSS - May