June

పడకేసిన ప్రాథమిక వైద్యం

                   మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్‌ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్‌ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్‌ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్‌ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది.

" అవినీతి - కార్పొరేట్ రాజకీయాలు - ప్రత్యామ్న్యాయం " సదస్సు

30-06-2015 సాయంత్రం 6 గం।। లకు 

హనుమంతరాయ గ్రంధాలయం ,గాంధీనగర్ ,విజయవాడ 

ముఖ్య అతిధి : బివి రాఘవులు 

హిందూ తీవ్రవాదులపై మెతక వైఖరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలోని ఎన్డీయే సర్కార్‌ మెడకు మరో వివాదం చుట్టుకుంది. 2008 నాటి మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితులుగాఉన్న హిందూ తీవ్రవాదుల పట్ల మెతక వైఖరి అనుసరించాలని జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఎ) ఒత్తిడి తీసుకొ చ్చినట్లు ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూ టర్‌గా ఉన్న రోహిణి శాలియన్‌ చెప్పారు. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా మరో 70 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మోడీ సర్కార్‌ అధికార పగ్గాలను చేపట్టిన నాటి నుండే హిందూ తీవ్రవాదులపై మెతక వైఖరి అనుసరించాలన్న ఆదేశాలు ఎన్‌ఐఎ నుంచి పెరిగాయని ఆమె తెలిపారు.

స్వంతవారు చేదయ్యారా!

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం విదేశీ కార్పొరేట్ల చేతిమీదగానే జరుగుతోందని వినిపిస్తున్న విమర్శలకు ప్రభుత్వ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్లాట్ల లేఅవుట్‌ రూపకల్పనను పరాయి కన్సల్టెంట్లకు అప్పగించేందుకు సిఆర్‌డిఎ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) అత్యుత్సాహం కనబరచడం ప్రభుత్వ వైఖరిలో భాగమే. ఇందుకోసం బహిరంగ టెండర్లు పిల్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులవారి చూపంతా విదేశీ ప్లానింగ్‌ కంపెనీల మీదే ఉంది. సింగపూర్‌, జపాన్‌ వారు మినహా భారతీ యులు అందునా ఆంధ్రులు పనికి రాకుండా పోయారు బాబుగారికి.

విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జూన్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ధర్నా

పోలవరం నిర్వాసితుల సమస్యలపై నీటిపారుదల శాఖ మంత్రికి సిపిఐ(ఎం) ప్రతినిధి బృందం విజ్ఞాపన - జూలై 5వ తేదీన సిపిఐ(ఎం) బృందంతో చర్చలు

సాహితీ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి

Pages

Subscribe to RSS - June