January

రాష్ర్టంలో ద‌ళితుల‌కు క‌రువైన ర‌క్ష‌ణ‌

రాష్ర్టంలో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని సిపిఎం రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి పి. మ‌ధు అన్నారు. తిరుప‌తి జిల్లా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  టిడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే ద‌ళితుల‌పై దాడులు పెరిగాయి. దేవ‌ర‌ప‌ల్లి, గ‌ర‌గ‌ప‌ర్రు, మ‌హాభార‌తం, నేడు గొటి్ట‌పాడు .ద‌ళితులకు ప్ర‌భుత్వం ఇచ్చిన భూములు తిరిగివ్వాల‌ని, ఇచ్చిన అప్పులు తిరిగి క‌ట్టాల‌ని ఒత్తిడి.వ‌రుస సాంఘీక బ‌హిష్క‌ర‌ణ‌లు, అత్యాచాలు విశాఖ జిల్లాలో ఓ ద‌ళిత మ‌హిళ‌పై దౌర్జ‌న్యంచేసి, వివ‌స్ర్త‌ను చేశారు.

గొట్టిపాడు దళితులకు అండగా సిపిఎం

గోట్టిపాడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన  పర్యటనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి  పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణయ్య ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.దళితులపై దాడుల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని మధు విమర్శించారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన కులోన్మాదుల్ని 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని, దళితులపై మోపిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, దళితులకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి, ఆ పంచాయతీకి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్ర

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు.

Pages

Subscribe to RSS - January