స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు.