మైలవరంలో భూపోరాటం..ఉద్రిక్తత

కృష్ణాజిల్లా మైలవరం అయ్యప్పనగర్‌లో సిపిఎం మైలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భూ పోరాటం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.వి.ఆంజనేయులు నేతృత్వంలో పేదలు తమకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ 9.43 ఎకరాల భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నాయకులను అరెస్టు చేసి స్థానిక స్టేషనుకు తరలించారు. అరెస్టులపై ఆగ్రహించిన పేదలు అక్కడి నుంచి ప్రదర్శనగా వచ్చి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.