మంత్రుల గుండాగిరి:జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలకు బీహార్‌ సైతం నివ్వెరపో తోందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై 10 నెలల్లో 13 సంఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఇటీవల దహనమైన చెరకు తోటను సోమవారం ఆయన తమ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూములివ్వని రైతుల పంటలు తగుల బెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.