గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధం..

రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమీపంలో మూడు గ్రామాలను ఖాళీ చేయించే ందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆ గ్రామాల వివరాలు తీసుకుంటోంది. వీటితో పాటు ప్లానింగ్‌కు ఇబ్బందిగా ఉందనే పేరిట దొండపాడు గ్రామాన్నీ దాదాపు ఖాళీ చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలందాయి. దీంతో రెవెన్యూ అధికారులు ఆ మూడు గ్రామాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది.