అమరావతిలో మట్టి సత్యాగ్రహం..

 ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతరం పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మట్టి సత్యాగ్రహాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది చేత మట్టిని సేకరించి మోదీకి పంపుతామని రఘువీరారెడ్డి అన్నారు.