కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్బెస్ట్ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు ఆల్బెస్ట్ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది. రెండున్నరేళ్లు పైబడిన సీనియర్ కార్మికులకు మూడు నెలల జీతాన్ని నష్టపరిహారంగా చెల్లించడానికి, మిగిలిన వారికి రెండున్నర నెలల జీతం...
District News
దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్ భవన్లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.
రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు.
భూసేకరణ పేరుతో బలవంతంగా రైతులనుంచి భూమి సేకరించడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా వ్యతిరేకించారు.సిపిఎం రాష్ట్ర ప్లీనం సందర్బంగా రాజమండ్రిలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు .. అభివృద్ధి ముసుగులో భోగాపురం ఎయిర్పోర్టు, బందరు పోర్టు, సోలార్ పార్కుల పేరుతో ఏపీ సర్కారు భూమిని లాక్కుంటోందని ఆరోపించారు..
నవసమాజ నిర్మాణం కోసం జరిగే సామాజిక ఉద్యమాలే అంబేద్కర్కు నిజమై న నివాళి అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. రాజమం డ్రిలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం పోరాడారని, కానీ నేటి పాలకులు సమాజం లో అంతరాలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దళి తులంతా సామాజిక పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దళితులు చదువుకోవ డం ద్వారా కొంత ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నారని తెలిపారు. పాలకులు ఆ విద్యను కూడా వారికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి జలవనరుల వినియోగంలో చిత్తశుద్దిలేదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్ హాయంలో జరిగిన తప్పిదాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో సాగుతున్నాయని ఆరోపించారు.ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి, పోలవరం పూర్తిచేయాలనుకుంటే తొలుత రీ డిజైన్ చేయాలన్నారు. ఉన్న కొద్దిపాటి నిధులను వినియోగించి 120 అడుగుల మేర ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నారు. అప్పుడు నీటి వినియోగంలో లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిర్వాసితుల సమస్య కూడా రాదన్నారు. అందుకు భిన్నంగా నిధులు లేని సమయంలో 152 అడుగుల పేరుతో కాలయాపన...
కాకినాడ: 'ఖజానా ఖాళీ అయింది... ఇప్పటికే రూ.8 వేల కోట్లు అప్పులు చేశాం. మరో రూ.8 వేల కోట్ల వరకూ అప్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం అవసరం. ఇది రెవెన్యూ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి' అని ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మన్యంలో మలేరియా, ఇతర విషజ్వరాల బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ప్రజా అవసరాలు తీర్చి, ప్రాణాలు నిలబట్టే వైద్యశాలగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు సారధ్యంలో జేవీవీ, ఇతర ప్రజా రంగాల వైద్యులు, నెల్లూరు ప్రజావైద్యశాలకు చెందిన వైద్యులు కూడా ఇక్కడకు వచ్చి సేవలు అందించారు. సెరిబ్రల్ మలేరియాతో వణుకుతున్న గిరిజనులను ఆదుకుని వారి ప్రాణాలు నిలబెట్టిన ఈ శిబిరానికి పలువురు సహాయం అందించారు.
పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ఏరియాలో భూ బ్యాంక్ ద్వారా గిరిజన...