పార్టీ కార్యక్రమాలు

Tue, 2016-03-22 12:46

రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజధాని నగరంలో రెండు మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపజేస్తామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయించే ప్రభుత్వం, పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాయకులు డిమాండు చేశారు..పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు  వేలాది...

Tue, 2016-03-22 09:41

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు. ఏ ఒక్కరికీ ఇల్లు, స్థలం రాకపోయినా, వచ్చిన అర్జీలను 85 శాతం పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొనటం గమనార్హమన్నారు. 

Sun, 2016-03-20 19:54

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

Fri, 2016-03-18 16:40

 స్థ‌లాలు, ప‌ట్టాలు,  రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

Wed, 2016-03-16 21:07

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.  స్థానికులు మాట్లాడుతూ, గత నాలుగు రోజుల‌ క్రిందట...

Wed, 2016-03-16 21:00

       
    ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్‌ తహసీల్ధార్‌ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్‌ గారికి  మెమోరాండం ఇవ్వడం జరిగింది.
    ఈ సందర్భంగా  సిపిఐ(ఎం) నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ జి.వో నెం 296 నిబంధనలను అధికారులు అతిక్రమిస్తున్నారని ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది ఉన్న కంప్యూటర్‌లో ఆఫ్‌లోడ్‌ చేయడం లేదని, ఆన్‌లైన్‌లో ధరఖాస్తు స్వీకరించడం లేదని, విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు  లేవు. ఫలితంగా పేదలు  తీవ్ర అభద్రతా...

Wed, 2016-03-16 16:42

 రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో పాల్గొనడానికి సీమ జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌...

Tue, 2016-03-15 19:13

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్వతంత్ర ఇంజినీరింగ్‌ నిపుణుల  బృందంచే  విచారణ జరిపించి, బృందం దృష్టికొచ్చిన పలు  విషయాలపై విచారణ జరిపి వాస్తవాలు  వెల్లడిరచాలని  నగర కార్యదర్శి బి గంగరావు డిమాండ్‌ చేశారు.
    విశాఖనగరంలో హదూద్‌ తుపాను...

Mon, 2016-03-14 19:53

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.
    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగరకార్యదర్శి బి. గంగారావు ప్రసంగిచారు. మొన్నటిదాక అదిగోవస్తుంది, యిదిగో వస్తుందని ప్రకటను గుప్పించిన ఎంపి హరిబాబు చావుకబురు చల్లగా చేప్పినట్లు విశాఖకు రైల్వేజోన్‌ రాదని పరోక్షంగా వ్లెడిచారు. రైల్వేజోన్‌ పై వేసిన కమిటి విశాఖకు వ్యతిరేకంగా...

Mon, 2016-03-14 17:48

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాల కోసం గత మూడు జన్మభూమి కార్యక్రమాలలో పేదలు పెట్టుకున్న లక్షలాది అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మూడు...

Wed, 2016-03-09 20:38

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.
    ఎంఎల్‌ఏల   ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాలు విశాఖనగర ప్రజలకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వవలు  ప్రజల  ఎడల  ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని...

Wed, 2016-03-09 17:20

    విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి  ఆదాయము, వ్యయముల‌పై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ బహిరంగ విచారణలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్‌.బాబూరావు  ప‌లు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్‌ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనల‌ను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్‌, కుటీరపరిశ్రమల‌పై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్‌ చార్జీలు...

Pages