December

అమోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు

శివసేన పార్టీ మరోసారి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ అంశంపై స్పందిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతీయ కార్యక్రమమని తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. ఇకనైనా మందిర నిర్మాణం తేదీని ప్రకటించాలని రాముడు గుడారంలాంటి చిన్నపాటి మందిరంలో ఉండటమేంటని ప్రశ్నించింది.

అసభ్యతే AAP ప్రామాణికతా?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో సహా ఆప్‌ నేతలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ గత కొద్దిరోజులుగా జైట్లీని లక్ష్యంగా చేసుకుని ఆప్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో గురువారం జైట్లీ ఎదురుదాడి చేశారు. 'ఢిల్లీ అసెంబ్లీలో, వెలుపల ప్రధానిని ఇతరులనుద్దేశించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనలేంటి? భారత ప్రభుత్వ అధికారులెవరైనా అటువంటి భాషను ఉపయోగిస్తారా? ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. అధికారంలో వున్నవారు కాస్తంత సంయమనం పాటించాలి. వారు విపరీతంగా వ్యవహరించకూడదు.

రేపు చండీయాగానికి చంద్రబాబు..

మెదక్ జిల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత చండీ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు హాజరు కానున్నారు. రేపు ఉదయం విజయవాడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్రవల్లి చేరుకుని 10 గంటలకు యాగంలో పాల్గొననున్నారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా సిపిఎం ప్లీనం..

 పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తేగాని పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సాధించలేము. ఆ నిర్ణయాల్లో మొదటిది, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం. దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. అలాగే ఇది సాధించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవాలి.

మోదీ లాహోర్‌ పర్యటనపై సీపీఎం..

ప్రధాని లాహోర్‌ పర్యటనను వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు స్వాగతించాయి. ఇరు దేశాల మధ్య చర్చలు స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని సీపీఎం అభిప్రాయపడింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని, ఇదే విద్వేషవాదులకు, ఉగ్రవాదులకు అసలైన విరుగుడు అవుతుందని, పాకిస్తాన్‌ ప్రధానితో తన భేటీకి ఏ అంశాలు ప్రేరణగా నిలిచాయో భారత ప్రధాని జాతికి తెలియజేస్తారని ఆశిస్తున్నామని సీపీఎం అభిప్రాయపడింది..

ఎవరి కోసం అరకు వేడుకలు?:మధు

 గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలతో సహా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి సమస్యలతో పాటు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాంట్రాక్టర్లను సంతృప్తి పర్చేందుకు, గొప్పల కోసం అరకు ఉత్సవాలను నిర్వహించడం సరికాదని సిపిఎం తప్పుపట్టింది. ఉత్సవాల నిర్వహణపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న గిరిజన ప్రజలు, నాయకులను పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్చివేస్తూ అరెస్టు చేయ టాన్ని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తీవ్రంగా ఖండించారు..

నేడే కలకత్తాలోCPM పార్టీప్లీనం

1964లో సిపిఎం ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక బర్ద్వాన్‌ ప్లీనం జరిగింది. మళ్లీ 37 ఏళ్ల క్రితం హౌరా జిల్లాలోని సాల్కియాలో ప్లీనం జరిగింది. సిపిఎం అవిర్భావం తర్వాత పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మూడో ప్లీనం కోల్‌ కతాలో డిసెంబర్‌ 27 నుంచి 31 వరకు జరగబోతోంది. 

అంబేద్కర్‌ది ఎనలేని పోరు:దడాల

దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ భవన్‌లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్‌ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.

బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర నిరసన..

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages

Subscribe to RSS - December