(visakha rural)
పెట్రో కారిడార్ కోసం చేపడుతున్న భూసేకరణపై 'యథాతదస్థితి' (స్టేటస్కో)ని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పట్ల సిపిఎం, ఇండిస్టియల్ పార్కు నిర్వాసితుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సిపిఎం, నిర్వాసితుల సంఘం నాయకులతో కలిసి విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పిసిపిఐఆర్ పేరిట 2010లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, దీనినే నేడు విశాఖ-చెన్నై కారిడార్గా మార్పు చేశారని తెలిపారు. 2,600 ఎకరాల జిరాయితీ భూముల సేకరణకు 4(1) నోటీసులు ఇచ్చిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిసర...