District News

(visakha rural)

             పెట్రో కారిడార్‌ కోసం చేపడుతున్న భూసేకరణపై 'యథాతదస్థితి' (స్టేటస్‌కో)ని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పట్ల సిపిఎం, ఇండిస్టియల్‌ పార్కు నిర్వాసితుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సిపిఎం, నిర్వాసితుల సంఘం నాయకులతో కలిసి విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పిసిపిఐఆర్‌ పేరిట 2010లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, దీనినే నేడు విశాఖ-చెన్నై కారిడార్‌గా మార్పు చేశారని తెలిపారు. 2,600 ఎకరాల జిరాయితీ భూముల సేకరణకు 4(1) నోటీసులు ఇచ్చిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిసర...

( visakha rural) ;   బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళలు పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మికులు ఉద్యమించారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నప్పటికీ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బ్రాండిక్స్‌ మెయిన్‌ గేట్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, జీతాల పెంపు వంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యానికి తలొగ్గారన్నారు. పలు పర్యాయాలు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. టార్గేట్ల పేరుతో రోజురోజుకు పనిభారం పెంచుకుంటూ పోతున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులలో, క్యాంటిన్‌లో...

visakha rural

- నిద్రహారాలు మాని ఆందోళన కొనసాగించిన మహిళలు
- బెదిరింపులకు దిగిన యాజమాన్యం
- తాగునీరు నిలుపుదల
- భారీగా పోలీసు పికెట్‌ 
- అయినా వెనక్కు తగ్గని కార్మికులు
- ఈ నెలాఖరు వరకూ గడువు కోరిన మేనేజ్‌మెంట్‌ ఆందోళన తాత్కాలిక విరమణ

సుమారు 3 వేల మంది మహిళా కార్మికులు. వీరిలో శుక్రవారం ఉదయం 4 గంటల షిఫ్ట్‌కు హాజరైన వారు ఉన్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఉండిపోయారు. తిండీ తిప్పలు లేవు. అయినా వారి పట్టుదల ముందు అవేవీ కనిపించలేదు. అతి తక్కువ జీతాలిస్తూ తమ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న,...

 (విశాఖ రూరల్)            ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదని సిపిఎం జిల్లా నాయకులు జి.కోటేశ్వరరావు విమర్శించారు. నర్సీపట్నంలో డివిజన్‌ స్థాయి సిపిఎం కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించ లేదని, కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేదన్నారు. బ్రాండిక్స్‌ కంపెనీలో కనీస వేతనాలు ఇవ్వాలని, నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 12 గంటలు పని చేయించుకొని కేవలం రూ.4వేలు మాత్రమే వేతనం ఇస్తుండటంతో బ్రాండిక్స్‌ కార్మికులు ఆందోళనకు దిగారన్నారు. ఈ విషయమై...

పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్‌లో ఇద్దరు, మైలాన్‌లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్‌ ఫార్మాలో బాయిలర్‌ లీకేజ్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్‌ఇజెడ్‌ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్‌ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టే వరకు అన్ని కంపెనీల్లో అందోళనలు చేయాలని...

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి గట్టించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి...

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం...

 చిత్తశుద్దితో రాజ్యాంగం అమలుతోనే సామజిక న్యాయం సాధ్యం అని ప్రముఖ రచయిత శ్రీ కంచే ఐలయ్య అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఉక్కునగరం లో కులవివక్షత వితిరేక పోరాట సంగం,ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం మరియు డి ఐ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సామజిక న్యాయం అనే అంశంపై జరిగిన జాతీయసదస్సు లో అన్నారు

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.
    ఈ సందర్భంగా గంగారావుగారు మాట్లాడుతూ రే లబ్ధిదారుకు...

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర
కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తొలుగుదేశం - బిజెపి కుమ్మక్కు
విమ్స్‌ నిర్వీర్యానికీ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగింత
    
    విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికెల్‌ సైన్స్‌ (విమ్స్‌) హాస్పటల్‌ అవుట్‌ పేషెంట్‌ (ఒ.పి) సేవలను ఏప్రిల్‌ 11న ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమ్స్‌లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఓపి సేవాలు  ప్రారంభించడం వెనుక తెలుగుదేశం, బిజెపిలు పెద్ద కుట్రకు పల్పపాడ్డాయి. ఈ చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖ నగర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
    విమ్స్‌ ఆధీనంలో 100 ఎకరాల స్థలం ఉంది. అందులో...

Pages