District News

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి...దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసకబార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసి తీవ్రమైన అబద్ధాలు వల్లించారు. అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు. ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడి ఇనుప గనులు కేటాయించడం. దేశంలో సొంత ముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ...

ఘనంగా అనంతగిరి మండల జెడ్పిటిసీ అభినందన సభ...

జెడ్పిటిసీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి అనంతగిరి మండల జెడ్పిటిసీ గా గెలిచిన దీసరి గంగరాజు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జి.కోటేశ్వరరావు, కీల్లో సురేంద్ర, ఉమ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...

దేశంలో పాలనంతా అంబానీ, అదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి డొలిచేస్తోంది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం దేశంలో సమీప భవిష్యత్తులో విశాఖ నుంచే ఉంటుంది' అని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో  విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వోకేషన్‌ హాల్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు పోరాడుతున్న తీరును అభినందించారు. భారత...

విశాఖ నగరంలోను, జిల్లాలో పలు మండలాల్లో బషీర్ బాగ్ విద్యుత్ అమరులకు నివాళ్ళు అర్పించారు.

విశాఖ నగరంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ 21 సంవత్సరాల క్రితం విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద ఆందోళన చేసిన వారిపై అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపించి రామకృష్ణ ,బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లను పొట్టనపెట్టుకుందని. వందలాది మంది గాయపర్చారన్నారు. ఆనాటి పోరాటం ఫలితంగా, తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పెంచలేదు. అయితే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును అమలు చేయడానికి అంగీకరించింది. ఇది అత్యంత...

విశాఖ ప్రజలకు భారంకానున్న ఆస్థి పన్ను, చెత్త పై పన్ను రద్దు చేయాలని శాంతియుతంగా విశాఖ జివిఎంసి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు.. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.క్రిష్ణారావు, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టు. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్.

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు,మందులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీల  ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని, కరోనా నేపధ్యంలో సామాన్యుల జీవితాలు దుర్బరం అయ్యాయని, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజుగడవని పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో  అఖిల పక్ష పార్టీలు బంద్  నిర్వహించాయి..విశాఖ ఉక్కు అమ్మేహక్కు కేంద్రానికి లేదన్నారు. ఎందుకంటే ఎన్నో త్యాగాల పునాదిపై విశాఖ ఉక్కు నిలబడి ఉందన్నారు.కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బంద్‌ ఉద్యమానికి ఆరంభమేనన్నారు. బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

Pages