District News

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా బాధితులకు నష్టపరిహారమివ్వాలని, దీనికి బాధ్యతగా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ అధికారులపై...

రైతులకు ప్లాట్లు ఇవ్వడం మొదలుపెట్టాక వాటితో వ్యాపారం చేయించేందుకు సిఆర్‌డిఎ సిద్ధమైంది. ప్లాట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో చర్చలు చేపట్టింది.రైతుల భూముల అభివృద్ధికి ముందుకొస్తే బిల్డర్లకు సిఆర్‌డిఎ నుండి అవసరమైన సహాయం అందిస్తామని, సిఎంతో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైతే చిన్న చిన్న ప్లాట్లు కలుపుకొని పెద్ద కమతాలుగా మార్చుకునేందుకు అవసరమైన నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్‌ కన్సార్టియానికి భూములు కేటాయించే సమయంలోనే రైతుల భూములనూ బిల్డర్లకు కట్టబెట్టించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తం...

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉ‍న్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు.

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు. జిడిపి వృద్ధిరేటు విషయంలో కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతోందని, అన్ని రంగాల్లో రెండు శాతమే వృద్ధి ఉంటే జిడిపి ఏడు శాతం...

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పట్టాదారులైన ఎస్‌సిలకు తెలియకుండానే వారి పేరుతో ఉన్న సొసైటీని రద్దు చేసి సంబంధిత భూములను అధికార పార్టీకి చెందిన నాయకులే స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ముందస్తుగా లభ్దిదారులకు ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంబంధిత అధికారితో సొసైటీని రద్దు చేయటం భావ్యం కాదన్నారు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి పత్తిపాటి...

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌. స‌మారు 480 కోట్లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం 22 కోట్ల‌కే వేలంలో పోంద‌డం అంటే...

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు. దుకాణాలు, వ్యాపారులు, వ్యక్తుల వద్ద అధికార పార్టీ నాయకులు బెదిరింపు వసూళ్లకు పాల్పడడమే కాకుండా ఏకంగా కళాశాల స్థలాన్నే కొద్ది...

కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జంపని వెంకటేశ్వర్లు కళావేదికపై నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు, పేద బడుగు వర్గాల హక్కుల కోసం...

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు రాజ్యమేలడం దేశ లౌకిక విధానానికి తీవ్ర విఘాతమని లౌకిక, ప్రజాతంత్ర...

సచివాలయ నిర్మాణ పనుల్లో చట్టాలను అమలు చేయాలని, నిర్భంధాలు వద్దనే డిమాండ్లతో గుంటూరులో రాజకీయ, ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని పేరుతో కార్మికులతో కార్పొరేట్‌ కంపెనీలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు.. రాజధాని నిర్మాణ అంశం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టాలన్నారు

Pages