District News

రాజధాని నిడమర్రు గ్రామంలో ప్రజా బాటను ప్రారంభించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు..నిర్మాణమై వృధాగా పడి ఉన్న టీడ్కో గృహాలను సందర్శించారు

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్ర విభజన సమస్యలపై 17వ తేదీ జరగనున్న వివాద పరిష్కార (డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌) సబ్‌కమిటీ సమావేశానికి ఉదయం పంపిన ఎజెండాలో ప్రత్యేకహోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలు పెట్టి తిరిగి సాయంకాలానికే వీటిని ఎత్తివేయడం గర్హనీయం. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, అన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలియజేయాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.  ప్రత్యేక హోదా చర్చకు రాకుండా బిజెపి నాయకత్వం అడ్డుకోవడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. బిజెపి విద్రోహంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గళం విప్పాలి. ప్రత్యేక హోదాను...

సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.

Pages