ఎల్ఐసి, ఏజెంట్ల రక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపీ తపన్సేన్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గురువారం ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన 4వ ఆలిండియా కాన్ఫరెన్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఐసినీ, ఏజెంట్ల వ్యవస్థనూ నిర్వీర్యం చేయడం జాతి వ్యతిరేక చర్య అని, ఈ అంశంలో కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.స్టాక్ మార్కెట్లలో పింఛన్లు, ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును పెట్టడాన్ని అందరూ వ్యతిరేకిం చాలన్నారు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఎల్ఐసి ప్రజలతో పొదుపు చేయించడంలో, వారి డబ్బుకు రక్షణ కల్పించడంలో కీలకపాత్ర...
District News
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్ మీదుగా సాగిన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్టి యు, టియుసిసి, వైఎస్ఆర్టియుసి, ఐఎన్టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...
అనకాపల్లిటౌన్: జిడిఎస్ ఉద్యోగుల వేతన సవరణను 7వ పే కమిషన్ పరిధిలోకి చేర్చకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించడానికి నిరసిస్తూ స్థానిక పోస్టాఫీసు వద్ద సి,డి,ఇ.డి. ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యాన బుధవారం పోస్టల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన నర్సింగరావు మాట్లాడుతూ యుపిఎ, నేడు ఎన్డిఎ ప్రభుత్వాల విధానాలు ఒక్కటేనని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని, వాటిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు ద్వజమెత్తారు.కార్పొరేట్ సంస్థల దయతో అధికారంలోకొచ్చిన మోడీ, వారి విచ్చల విడి వ్యాపారాలకు అడ్డు...
కోరంగి భూముల ఘటనపై న్యాయం చేయాలని ఎస్పి రవిప్రకాష్, ముమ్మిడివరం ఎంఎల్ఎ దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఆర్డిఒ అంబేద్కర్లను అఖిలపక్షం నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకుల బృందం ముమ్మిడివరం ఎంఎల్ఎను కలిసి ఘటనా వివరాలను, పేదలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి స్పందించిన ఆయన పోలీసుల అత్యుత్సాహంపై ఎస్పితో మాట్లాడారు. ఆర్డిఒకు ఫోన్ చేసి భూములపై సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని విచారణ నిర్వహించాలన్నారు.
టిడిపి ప్రభుత్వం విలీన మండలాలపై తీవ్ర వివక్షను చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. సిపిఎం కూనవరం డివిజన్ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కూనవరం ఫారెస్టు అతిథి గృహంలో కుంజా సీతారామయ్య అధ్యక్షత న శనివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మా ట్లాడుతూ, ఉపాధ్యాయులు లేక విలీన మండలాల్లో ప్రభు త్వ విద్య మరుగున పడిందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో గిరిజనులకు వైద్యం దూరమైందన్నారు. మలే రియాతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఏడు మండ లాలు విలీనమై 16 నెలలైనా ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పోలవరంలో తాగునీరు లేక ప్రజలు...
కేంద్రమంత్రివర్యులు వెంకయ్యనాయుడుగారు మరో మారు తన వాచాలతను ప్రదర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిట్ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని విద్యార్థులు నినదించినదే తడవుగా ఆయనకు ఆగ్రహం కట్టలు తెగింది. హోదా విషయమై ప్రతిపక్షం వారి విమర్శలను సైతం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఆవేశం, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష, పరనిందలతోనే సాగింది. వంటికి వేసుకొనే చొక్కా రంగు మొదలుకొని భుజాన మోసే పార్టీ జండా వరకు ఏకరువు పెట్టి రాజకీయాల్లో తానేవిధంగా స్వశక్తితో ఎది గారో గొప్పగా చెప్పుకున్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన ఆంధ్ర పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడబట్టే రాష్ట్రానికి కొంతయినా...
డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ విధానాన్ని విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు కలిగే నష్టాలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసింది.90 శాతం డిగ్రీ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇలాంటి స్థితిలో ఆరు నెలల కాలంలో నాలుగు ఇంటర్నల్స్, నాలుగు ప్రాక్టికల్స్, రెండు సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. డిగ్రీలో ఉపాధి కోర్సులు ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులలను వెంటనే భర్తీ చేయాలని, సెమిస్టర్ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా...
రెవెన్యూ శాఖ లోపం వల్లే తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రుని కోరంగి కంపెనీ భూ వివాదానికి కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీషు పాలన అనంతరం కోరంగి రైసుమిల్లు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇటీవల రైసుమిల్లును పడగొట్టి ఒకరు ఇటుక, ఇంకొకరు కలప తరలించుకు పోయానా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుందన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ శేషగిరిరావు ఆ భూములపై లోతుగా విచారించలేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఒక దళితుడి చేయి విరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, పేదలపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారని మండిపడ్డారు. పోలీసులు భూస్వామికి కొమ్ము కాసి తప్పుడు...