హోదా రాదని బాబుకూ తెలుసు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా రాదని, చంద్రబాబు సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలందరికీ ముందే తెలిసినా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్ని స్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి అభిప్రాయ పడ్డారు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం సందర్భంగా శనివారం విజయవాడ వచ్చిన ఎంపీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా, ఉనప్పుడు మరో విధంగా మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.