విషం చిమ్ముతున్న 'దివీస్‌'

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.