రెవెన్యూశాఖ లోపం వల్లే:దడాల

రెవెన్యూ శాఖ లోపం వల్లే తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రుని కోరంగి కంపెనీ భూ వివాదానికి కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీషు పాలన అనంతరం కోరంగి రైసుమిల్లు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇటీవల రైసుమిల్లును పడగొట్టి ఒకరు ఇటుక, ఇంకొకరు కలప తరలించుకు పోయానా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చూస్తూ ఊరుకుందన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్‌ శేషగిరిరావు ఆ భూములపై లోతుగా విచారించలేదన్నారు.