రామోజీ ఓం సిటీకి వెయ్యి ఎకరాలు

‘ఓం సిటీ’కి తెలంగాణ సర్కారు వెయ్యి ఎకరాల భూమి కేటాయించబోతోంది. ఇందులో ఐదు వందల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి కాగా..మిగిలిన మొత్తం సేకరించి ఇవ్వనుంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కొద్ది కాలం క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశం అయి..ఓం సిటీ ప్రాజెక్టు గురించి వివరించటంతోపాటు..ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై సీఎం కెసీఆర్ కూడా సానుకూలంగా స్పందించటంతో పాటు..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.