బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర..

కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి. రైతులు తిరుగు బాటు చేస్తేనే ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు అడ్డుకట్ట పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపు నిచ్చారు.