ప్రత్యేకహోదా కోరుతూ విజయవాడలో ధర్నా

ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కూడా దోహదం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ లెనిన్‌ సెంటరు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌, పూర్తి స్థాయిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు రాలేదన్నారు.