ప్రజా చైతన్య యాత్రలు:ఎమ్మెల్సీ శర్మ

 ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ తెలిపారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కులం, మతం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. భవిష్యత్‌ రాజధాని ఎలా ఉండబోతుందో చూపిస్తున్న ప్రభుత్వం అందులో కార్మికులు, కూలీలు, రైతులు, ఇతర సామాన్యుల స్థానమేమిటో, వారి జీవనోపాధి ఎలా ఉండాలో ప్రస్తావించడం లేదన్నారు. రాజధాని ముసుగులో చేస్తున్న రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం రెండుమూడేళ్లల్లోనే బట్టబయలవుతుందన్నారు.