గ్గయ్యపేటరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నారని సిపిఎం డివిజన్ కార్యదర్శి సోమోజు నాగమణి విమర్శించారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ మండలంలోని షేర్మహమ్మద్పేట అడ్డరోడ్డులో ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను సిపిఎం డివిజన్ నాయకులు ఘంటా నాంచారయ్య ప్రారంభించారు. ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జాన్పాషా ముగించారు. సిపిఎం డివిజన్ నాయకులు కాకనబోయిన లింగారావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్, రామకృష్ణ, షేక్ గౌస్మియా, ప్రణయ తేజ, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.