నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎస్సి, ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కార్య దర్శి అండ్య మాల్యాద్రి డిమాండ్ చేశారు. ప్రయి వేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ శాంతినగర్లో సోమవారం కెవిపిఎస్ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు పూర్తిగా విస్మరించా యని విమర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నగర కార్యదర్శి జి.నటరాజు పాల్గొన్నారు.