పెద్దల సభలో కులం రగడ..

గుజరాత్‌లోని ఓ ఆలయంలో తనను కులం అడిగారంటూ కాంగ్రెస్‌ ఎంపి కుమారి షెల్జా చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కుమారి షెల్జా మాట్లాడుతూ..తాను యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడు గుజరాత్‌లోని ద్వారక ఆలయాన్ని సందర్శించానని, ఆ సమయంలో తన కులమేమిటని అక్కడి నిర్వాహకులు అడిగినట్టు ఆమె తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్‌ నమూనానే అనుసరిస్తోందంటూ ఆమె విమర్శించారు.