నీరోలా మారిన నారా:రఘువీరా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూస్తుంటే నీరో చక్రవర్తి తీరు గుర్తుకు వస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకాలు కృష్ణా, పెన్నా డెల్టాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భాగస్వామ్య సదస్సు ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న బోగస్‌ ప్రచారమని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.