దళిత MROపై VHPదాడి

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలంలోని పిడింగొయ్యిలోని వివాదాస్పద భూమిలో ఆలయ ప్రవేశానికి అవకాశం కల్పించా లంటూ విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకులు, స్థానిక పెత్తందార్లతో కలిసి గురువారం రూరల్‌ తహశీల్దార్‌ జి.భీమారావుపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు.